అవతార పురుషులు

తక్కిన బాలురతో పాటు రాముడు కూడా వశిష్టుని పాదాల చెంత కూర్చుని విద్యనభ్యసించాడు. కృష్ణుడు కూడా సుదాముడు మొదలైన మిత్రులతో కలసి సాందీపుని గురువుగా స్వీకరించి విద్యనభ్యసించాడు. నిర్గుణనిరాకార పరబ్రహ్మముమానవాకృతి ధరించి భూమిపై అవతరించినప్పుడు అవతారము యొక్క ప్రవర్తన తక్కిన వారికి ఆదర్శప్రాయంగా ఉండాలి.

(స.శి.సు.నాపు.5)

 

అవతారపురుషులు కూడా అధ్యాపకుల వద్ద శిక్షణ పొందివిద్య నేర్చి గురువుల ఆదేశానుబద్ధులై యుండవలెను. దైవ స్వరూపులైన వారు స్వతస్సిద్ధముగా సర్వజ్ఞులై యున్ననూవారు విద్యార్థులుగా వ్యవహరించి నంతకాలము విద్యార్థి విధులనుకర్తవ్యములను చక్కగా పాటించి ప్రపంచమునకు ఆదర్శముగా నుండెదరు. శ్రీరామచంద్రుడు వసిష్ట మహామునివద్దశ్రీకృష్ణుడు సాందీపని మహర్షి వద్ద గురుకులవాసము చేసి విద్యనభ్యసించిరి. స్వామియూఅదే విధముగా నాలుగు ఊళ్ళలో పుట్టపర్తిలోబుక్కుపట్టణంలోకమలాపురములోఉరవకొండ స్కూళ్ళలో చదివారు.

(లీ. నా. సా.పు.49)

 

భూకంపములువరదలూఅనావృష్టికరువులూఅంటువ్యాధులు అటువంటి విపత్తులను ఎదుర్కొనగల దివ్యశక్తిని మానవులలో ఆవిర్భవింపచేయటమే ఇప్పుడు నేను కొనసాగిస్తున్న ఉద్యమము. తాత్కాలిక సమస్యలను పరిష్కరించటము. దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించటమూప్రజలకు అలవరచటంద్వారా అవతారపురుషుడు రెండు విధాలుగా మానవజాతికి సాయపడగలడు. తాత్కాలికమైన పరిష్కారము అన్నిటికీ మూలమైన కర్మసూత్రమునకు భిన్నంగా వర్తించవలసి వస్తుంది. ప్రజలలో అధిక సంఖ్యాకులు స్వార్థముతో కోరికలతో కూడిన కర్మ సూత్రమునకు లోబడిన భౌతిక ప్రపంచంలో జీవిస్తున్నారు. తమ కర్మఫలమును అనుభవిస్తున్నారు. దీనినిబట్టి వారికి పురోగతికానీఅధోగతికానీ లభిస్తున్నవి. అవతార పురుషుడు తాత్కాలిక సమస్యల పరిష్కారంలో జోక్యం కల్పించుకుంటే ప్రజలకార్యకలాపములు,అభ్యున్నతి,పరిణామమూనిరోధించినట్లుఅవుతుంది.సహజమయినప్రకృతినియమాలకు ఆటంకం కలిగించే ఇటువంటి తాత్కాలిక పరిష్కారాలు పనికిరావు.

 

ఇంతకంటే ప్రయోజనకరమైన మార్గము ఇంకొకటి వున్నది. అవతారపురుషుడు ప్రజల చైతన్యస్థాయిని పెంచి ఆధ్యాత్మిక సూత్రముల స్వరూపమును గుర్తింపజేయాలి. అప్పుడు ప్రజలు ధర్మమార్గమును అనుసరించి ఉత్తమ మైన పరిస్థితులను ఏర్పరుచుకోటానికి దృఢ సంకల్పముతో కృషి చేయగలరు. అప్పుడు వారికృషి ప్రకృతి నియమములతో కర్మ సూత్రములతో సమన్వయము పొందుతుంది. అప్పుడు వాళ్లు యీ కారణ కర్మల చక్ర పరిధిని దాటుకునిప్రకృతి శక్తులను వశపరచుకొనియీ విపత్తుల నుంచి తప్పించుకో గలుగుతారు.

 

సరిగ్గా వాళ్లు నా సంకల్పశక్తిలో భాగస్వాములౌతారు. నేను వాళ్ల ద్వారా పనిచేసివారిలో అంతర్గతంగా ఉన్న దివ్యత్వాన్ని మేల్కొలిపిప్రకృతిశక్తులను వశపరచుకునే విధంగా వున్నతమైన సత్యం వైపు వాళ్లని మళ్లించాల్సి వుంటుందిఅట్లాగాకవున్నపాటుగా ప్రజల్నీ స్థితిలోనే వుంచిఅన్నీ నేనే సరిచేసినట్లయితేఅన్ని వ్యవహారాలు అస్తవ్యస్తం అయి వెనకటి సందిగ్ధ పరిస్థితి తిరిగి నెలకొంటుంది. కష్టాలుబాధలూ దివ్యలీలలోని భాగాలే. ఇవి భగవంతుడు కల్పించేవి కావు. మానవులే తమ పాపకార్యాలకు ప్రతిఫలంగా వీటిని ఆహ్వానిస్తారు. ఇది మానవుని బాగుచేసే శిక్ష. దీనివల్ల మానవుడు దుర్మార్గాన్ని విడిచిసచ్చిదానంద తత్వం వైపు పయనిస్తాడు. ఇదంతా మహాసమ్మేళనంలోని భాగం. దాన్లోని ప్రతికూలాలన్నీ అనుకూలాల్ని పెంచటానికి దోహదం చేస్తాయి. మృత్యువువల్ల అమృతత్వంఅజ్ఞానం వల్ల జ్ఞానంబాధలవల్ల సంతోషంరాత్రివల్ల పగలూ విశేషంగా ప్రకాశిస్తున్నాయి.

 

అందువల్లఒకవేళ అవతారాలు యీ విపత్తులన్నీ తొలగించేటట్లయితేకర్మసూత్రంలో కూడిన యీ సృష్టి నాటకమంతా ఆగి పోతుంది. అయితే అవసరం వచ్చినప్పుడు నేనేదైనా చెయ్యగలను. చేస్తాను. కానీయీ ఆపదలన్నీ మానవుడు కల్పించేవే గానిదేవుడు కల్పించేవి కావనిమాత్రం జ్ఞాపకం వుంచుకో. అందువల్ల మనిషిలోని ఆహంకారం తొలగించికర్మచక్రాన్ని అతిక్రమించే విధంగా అతనిలో చైతన్యం వికసించిప్రకృతిని వశపరచుకునే విధంగా దానిని పునర్నిర్మించాలి. ఇదే అవతారం యొక్క కార్యక్రమం. దీన్నే నేనిప్పుడు అమలు పరుస్తున్నాను.

(స.ప్ర.పు.21/23)

(చూ॥ ఆత్మ/ఆత్మారామాయణము)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage