కురుక్షేత్ర యుద్ధము జరిగినపుడు, కృష్ణునికి 84 సం॥ల వయస్సు. కీ.పూ. 3138 సం॥లో ధర్మరాజు యొక్క పట్టాభిషేక మహోత్సవము జరిగింది. ఆతరువాత కృష్ణుడు ద్వారకకే విజయము చేసి, ప్రజల కోరికలను మన్నించి, 36 సంవత్సరములు ప్రజలకు ఆనందమందించి. కీ.పూ.3102 ఫిబ్రవరి 17-18 ఆర్ధరాత్రి సరిగ్గా పాంచ భౌతిక శరీరమును త్యజించినాడు. ఆ వార్త విని పాండవులు దు:ఖించిరే కానీ, కృష్ణుడు నిత్య స్వరూపుడు, ఆనంద స్వరూపుడు. ప్రేమ స్వరూపుడు అని సున్నితముగా తెలుసుకున్న గోపికలు ఏ మాత్రమూ చలించలేదు, విచారించలేదు. వారిది నిర్మల చిత్తము, నిశ్చల భక్తి, విస్స్వార్థ సాధన.
(స.సా. జా లై 78 పు. 100/101)