జిహ్వ చాపల్యం

మానవుడు జిహ్వచాపల్యం చేత రుచికరమైన పదార్ధాలనే అనుభవించాలని ఆశిస్తున్నాడు. 84 లక్షల జీవరాసులలో మానవుడొక్కడే ప్రాకృతమైన ఆహారాన్ని మార్చు కొంటున్నాడు. ఇంక పశు పక్షి మృగాదులన్నీ సహజమైన ఆహారమునే భుజిస్తున్నాయి. కనుకనేపశు పక్షి మృగాదులకు ఎక్కువగా రోగములు రావటం లేదు. కానిమానవుడు తన జిహ్వచాపల్యం చేత ఆహారమును అనేక రకములుగా ఉడుకబెట్టిఅందులోని ప్రాణశక్తిని చంపివేసిఒట్టి పిప్పిని మాత్రమే భుజిస్తున్నాడు. మానవుడు జిహ్వ చాపల్యమునకు లోనయ్యాడు. కనుకరుచి చూడకూడదు. మనం ఔషధాలను సేవిస్తుంటాము. ఎందుకోసంరోగనివారణ కోసం వాటిని సేవిస్తుంటాము. అయితేరోగ నివారణమే లక్ష్యంలో ఉంచుకోవాలి గానిడాక్టరు ఇచ్చే ఔషధము తీయగా ఉండాలనుకుంటే వీలుకాదు. ఈ ఆహారం కూడా ఔషధము వంటిదే. ఏమిటీ ఔషధముఆకలి అనే రోగమునకు అన్నము ఒక ఔషధము. దాహమనే రోగమునకు నీరు ఒక ఔషధము. ఈ ఔషధములలో మనం రుచుల నెందుకు చూడాలిఎంతవరకు మంచిదో అంతవరకే మనం రుచిని చూడాలి. రోగములు రాకుండాభావములు మారకుండాబుద్ధులు కదలకుండా ఉండే నిమిత్తమై ఆహారం అతి శుద్ధమైనదిగా ఉండాలి. చాలా మంది డాక్టర్లు - మాంసమునుచేపలను భుజించమనివాటిలో మంచి ప్రోటీన్సు  ఉంటాయని చెబుతూంటారు. వారు ప్రొటీన్సునిదేహబలమును చూస్తారే తప్పఆధ్యాత్మిక తత్వాన్ని ఏమాత్రం విచారించరు. పాలలో ప్రొటీన్సు లేవాపప్పులలోపెరుగులో ప్రొటీన్స్ లేవాతుచ్ఛమైన మాంసమును తినిఅట్టి బుద్ధులను మనము ఎందుకు పెంచుకోవాలిఅటువంటి ఆహారము వలన మనం కూడా Animals గా తయారైపోతాము . Food ని బట్టి Head, Head ని బట్టి God కనుక, Food, Head, God ఈ మూడింటికీ సన్నిహిత సంబంధము ఉంటుంది. చేపలు చాలా చురుకు తనాన్ని తెలివితేటలను ఇస్తాయి. నిజమే కాని కంపు స్వభావములను పుట్టిస్తాయి. వీటి వలన Bad Thoughts (చెడ్డ ఆలోచనలు వస్తాయి. చేపలు ఇచ్చే Bad Thoughts మరేవీ ఇవ్వవు కనుకవీటిని కొంతవరకు అరికట్టుకోవాలి.

(శ్రీ.భ.ఉ.పు.140/141)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage