భగవంతుడు మానవదేహంలో ప్రతి ణువునందు, ప్రతి అంగమునందు రసస్వరూడై నివసిస్తూ క్షణ క్షణమూ మానవుణ్ణి కాపాడుతూ, పోషిస్తూ వస్తున్నాడు, కనుకనే భగవంతుణ్ణి అంగీరసుడు అన్నారు. భగవంతుని నుండి ఇట్టి రక్షణ పొందడంచేత మానవుడు భగవంతునికి ఋణపడి యుంటున్నాడు. ఈ ఋణమును తీర్చుకోవాలంటే మానవుడు తన శక్తికొలది సత్కర్మల నాచరించాలి. తోటి మానవునికి తోడ్పడాలి, సమాజ సేవలో పాల్గొనాలి. అయితే. సేవ చేయడం పరులకు సహాయపడటం కోసమని భావించకూడదు, తన ఋణవిముక్తి కోసమే అని గుర్తించాలి. ఏ సేవ చేసినప్పటికీ దైవఋణం కొంతవరకు తగ్గిపోతుంది. సేవకుడే నిజమైన నాయకుడు. భగవంతుడు దేహము నిచ్చినది సేవ చేయడానికే అని గుర్తించి సేవలో పాల్గొని దైవ ఋణమును తీర్చుకొని మానవుడు ధన్యుడు కావాలి. (స. సా మే 2000 పు. 141/142)