నాలుగు మార్గాలు

మానవులు ఇపుడు నడచుచున్న మార్గములు నాలుగు. మొదటి మార్గము కర్మాతీతమైనది. రెండవది నిష్కామకర్మ మార్గముమూడవది కామకర్మ మార్గమునాలుగవది కర్మభ్రష్టు మార్గము.

ఇందులో మొదటి వారైన కర్మాతీతులు జీవన్ముక్తులు! వారు చేసిన సర్వకర్మలూ జ్ఞానాగ్నితో భస్మమయి పోవునుచేయవలససిన పనియూచేయరాని పనియూ విధి నిషేధములు లేవు. సాధనలు దానధర్మములుతపములు కూడా వేరే యేమీ వుండవు. వారు చేసిన కర్మలన్నియూ భగవత్ కర్మలగనే మారును. వారుతమ కాలు పెట్టిన స్థానమంతయూ కైవల్యముగానే నుండును. ప్రతి మాటబ్రహ్మవాక్కుగానే మారును. అట్టివారు దేహమును విడిచిన తక్షణమే వారి ప్రాణము యెక్కడో పోనక్కర లేదు. అక్కడిక్కడే బ్రహ్మమును పొందును. అట్టివారే పైన చెప్పిన కైవల్య ప్రాప్తికిబ్రహ్మ ప్రాప్తికిసద్యోముక్తికి సంబంధించిన వారు. 

 

"తరువాతరెండవ తెగవారు నిష్కామకర్మయోగమును అవలంభించువారువీరినే ముముక్షువులని అందురు. అనగా మోకాపేక్ష కలవారనివీరుచేయు సర్వకర్మలూ భగవత్ ప్రాప్తి భావము తోనే చేయుదురు. వేరు ఫలములనాశించరు. వీరు సత్ కర్మలు మాత్రమే చేతుతురు. లోక సంబంధమైన వాంఛలు కానీ మరే విధమైన స్వర్గాది లోకముల ఆశకాని వీరిలో వుండవు. కేవలము మోక్షమును మాత్రము కోరుచుందురు. వారి దీక్షనుబట్టి భగవత్ కటాక్షము కలిసి కరిగి అనుగ్రహించును. 

 

"ఇకమూడవవారుసకామ కర్మయోగులువీరు ఫలాపేక్షతో సత్కర్మలాచరింతురు, శాస్త్రవిహిత కర్మలను మాత్రమే చేతురు. పాపకర్మలు కానీనిషిద్ధకర్మలు కానీ వీరు చేయరు. అటులే వీరి అభిష్టము: సుఖములు భోగములు కావలెననిఏ సత్ కర్మ చేసిన యే సుఖము కలుగునోయే పుణ్యకర్మలు చేసిన యే భోగాది స్వర్గములు లభించునో అని ఫలమును మొదట లక్ష్యమునందుంచు కొని పవిత్ర కర్మల నాచరింతురు. అట్టివారు శరీరమును వదలిన తరువాత స్వర్గాది లోకములకు పోయివారు చేసిన పుణ్యము నశించు వరకూ వుండితరువాత భూలోకమునకు వత్తురు.

 

"ఇక మిగిలిన నాలుగవ తెగవారు: కర్మభ్రష్టులు. వీరికి పుణ్యముకాని పాపముకానిమంచికానిచెడ్డ కానీనీతి కానీనిమము కానీశాస్త్రము కానీధర్మముకాననీదైవముకానీ దయ్యముకానీయేవీ లేవు. ఇట్టి వానిని మనిషి రూపముననున్న మృగమని తెలుపవచ్చును. లోకమున ఈ తెగకు చెందినవారే అధిక సంఖ్యాకులు కలరు. తాత్కాలిక సుఖముఆనందముఆహారముహాయి వీరి ఆశయము. వీరు మానవ రూపముతో నున్న వానరులని చెప్పుటకు కూడా వీలు కాదు. వానరులయినా ఒక స్థానమును వదలి మరొక స్థానమునకోఒక కొమ్మను వదలి మరొక కొమ్మకో యేగుదురువీరట్లుకాదుమరొకటి ఆధారము చేసుకొని ఉన్న దానిని విడతురు. అనగాఆనపకాయలందునుచెట్ల కొమ్మల యందునూఒక విధమైన పురుగుండును. అది ఒక ఆకునుండి మరొక ఆకును చేరునపుడు ముందు మూతితో ఒక ఆకును కరచుకొని వెనుకవైపున మరొక ఆకును వదలును. అటులనే వీరునూక్రిములవలే దేహమును విడచిమరొక దేహమును అప్పుడే అందుకొనుటకు సిద్ధముగావుందురు. వీరికి యే లోకమూ లేదురాదు. జనన మరణములే వీరికి ప్రాస్తము. వారికి పవిత్ర కాలము వచ్చు వరకూ ఈ విధమైన ప్రయాణమే చేయుచుందురు.

(గీ. పు.152/154)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage